Header Banner

Nara Lokesh Schedule: కేంద్ర న్యాయ శాఖ మంత్రితో నారా లోకేష్ భేటీ! ఈ రోజు ఫుల్ షెడ్యూల్!

  Wed Jun 18, 2025 10:07        Politics

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక నాయకుడైన మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం రెండు రోజుల పర్యటనలో ఢిల్లీలో ఉన్నారు. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను కలిసి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను, అనంతరం సాయంత్రం 4:30 గంటలకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలవనున్నారు. ఈ సందర్భంగా జాతీయ నూతన విద్యా విధానం గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. సాయంత్రం 5:30కు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌తో సమావేశమయ్యే లోకేష్, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అంశంపై చర్చించనున్నట్టు సమాచారం.

 

ఇది కూడా చదవండి: మంగళగిరి మీదుగా మరో రైల్వే లైన్! రూ.2,000 కోట్లతో.. రూట్ మ్యాప్ ఇదే!

 

ఈ నెల 19వ తేదీ ఉదయం కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియాతో భేటీ అయ్యే లోకేష్, అనంతరం బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో సమావేశం కానున్నారు. ఈ మేరకు అధికారిక షెడ్యూల్ విడుదలైంది. ఇటీవల ఆయన కుటుంబ సమేతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుండగా, ప్రధాని మోదీకి ఆహ్వానం అందించినట్టు సమాచారం. ఈ కార్యక్రమ ఏర్పాట్లను చంద్రబాబు, లోకేష్ స్వయంగా సమీక్షించారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

YS Jagan: వైసీపీలో హై టెన్షన్! జగన్ పల్నాడు పర్యటన వేళ..

 

Economy Park: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! చంద్రబాబు మరో కీలక నిర్ణయం! రూ.1500 కోట్లతో.. 400 ఎకరాల్లో..

 

ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 

Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

 

Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో..

 

Gold rates: పసిడి ప్రియులకు శుభవార్త... భారీగా తగ్గిన బంగారం ధరలు!

 

Andhra Economy: చంద్రబాబు సమీక్షలో దిశానిర్దేశం! 15% వృద్ధి లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ!

 

Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!

 

 Annadaata sukibhava: రైతులకు బిగ్ రిలీఫ్! వారికి ఈ కేవైసీ అక్కర్లేదు.. స్టేటస్ చెక్ చేసుకోండి!

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

Praja Vedika: నేడు (18/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #NaraLokeshInDelhi #NaraLokeshTour #DelhiMeetings #LokeshPoliticalTour #APBJPMeetings #KurnoolHighCourtBench #NationalEducationPolicy #YSRCPvsTDP #TonyBlairMeeting #YogaDay2025Preparations